- Advertisement -
లక్నో: ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తిని ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కొట్టి చంపినందుకు ఉత్తరప్రదేశ్లోని బందా స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది మంగళవారం తెలిపారు. “హీరలాల్ యాదవ్(40) హత్య కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత, అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి అతని కుటుంబసభ్యులకు జామమ్ యాదవ్, విశ్వనాథ్, రాంసంజీవన్, రంభరోసా, రామ్ప్రతాప్, చోటా యాదవ్, దావు యాదవ్ లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కరికి 10,000 రూపాయల జరిమానా విధించిందని” అని బందా జిల్లా సహాయ ప్రభుత్వ న్యాయవాది అశుతోష్ మిశ్రా చెప్పారు. తమ ఇంట్లోని మహిళను చూశాడన్న కోపంతో కుటుంబ సభ్యులందరూ కలిసి జూలై 27, 2015 న హీరలాల్ను అతని కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- Advertisement -