- Advertisement -
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద శనివారం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్న పోలీసులు కారులో ఉన్న ఐదుగురు మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -