Thursday, April 25, 2024

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తున్న ఓ బస్సు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

8 killed after Bus falls into well in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News