- Advertisement -
న్యూఢిల్లీః భారతీయులకు కువైట్ దేశం షాకిచ్చింది. ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైట్ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమెదం తెలిపింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశీయులను వెనక్కి పంపించాలని స్థానికంగా డిమాండ్ పెరగడంతోపాటు చమురు ధరలు కూడా తగ్గిపోవడంతో విదేశీయుల్ని 30శాతానికి తగ్గించుకునేందుకు అక్కడి ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో కువైట్లో ఉంటున్న ఎనిమిది మంది లక్షల భారతీయులను వెనక్కి పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో 70 శాతం మంది ప్రవాసీలు ఉన్నారు.
8 lakh Indians may have to leave Kuwait
- Advertisement -