Thursday, April 25, 2024

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన.. రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎస్ పి దేవేంద్ర మిశ్రాతో సహా ఎనిమిది మంది పోలీసులను  దుండగలు కాల్చి చంపిన ఘటన కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చౌబేపూర్ సమీపంలో దిక్రూ అనే గ్రామంలో గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే నివాసం ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున వికాస్ దుబే పట్టుకునేందుకు వెళ్లిన ఎస్ పి దేవేంద్ర మిశ్రా నేతృత్వంలోని బృందపై అతని అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. ఓ ఇంటిపైకప్పు మీదనుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు.. దీంతో 8మంది పోలీసులు ఘటనాస్థలంలోనే చనిపోయారు. రౌడీమూకల దాడిలో మరణించిన వారిలో ఎస్ పి దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుల్ లు ఉన్నారు. దీంతో డిజిపి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బారీగా పోలీసు బలగాలను ఘటనా స్థలానికి తరలించి దుండగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

8 Policemen killed in Encounter near Kanpur in UP

8 Policemen killed in Encounter near Kanpur in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News