Wednesday, April 17, 2024

ఆటో బోల్తా.. 8మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరగింది. సోమవారం ఉదయం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం.

8 Students Injured in Road Accident in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News