- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 948 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,69,223కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడి 1,455 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,490 యాక్టివ్ కేసులుండగా… 2,57,278 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో 8,367 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లో కొత్తగా 131, మేడ్చల్ 82, రంగారెడ్డి 58 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
805 new covid-19 cases reported in Telangana
- Advertisement -