- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 27,861 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 81 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. అదే సమయంలో 263 మంది కోలుకున్నారు. ఈ వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,141 మంది బాధితులు కరోనాతో మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎపిలో ప్రస్తుతం 1,713 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 8,76,949 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం కోటీ 26 లక్షలకు పైగా మందికి కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
81 New Covid 19 Cases Reported in AP
- Advertisement -