న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 8,171 కొత్త కోవిడ్-19 కేసులు, 204 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 98వేల 706కి చేరింది. దేశంలో ప్రస్తుతం 97,581 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95,526 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వైరస్ మహమ్మారి బారినపడి దేశంలో 5,598 మంది చనిపోయారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
అటు మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 70,013మందికి కరోనా వైరస్ సోకింది. 2,362మంది కోవిడ్ తో మృతిచెందారు. తమిళనాడులో 23,495 కేసులు.. 184 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 20,834 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 523మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ లో 17,200 కేసులు నమోదు కాగా… 1063 మంది కోవిడ్ తో ప్రాణాలు విడిచారు. భారత్ లో కరోనా వైరస్ కేసులు 2లక్షలకు చేరువయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
8171 new covid 19 cases and 204 deaths in india