Thursday, April 18, 2024

ఎపిలో కొత్తగా 8,239 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8239 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. కొత్తగా 8,239 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 61 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 11,135 మంది బాధితులు కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో అధికంగా 1,396, తూర్పు గోదావరి జిల్లాలో 1,271, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 254 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఆంధ్రలో ఇప్పటివరకు మొత్తం 11,824 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 17,96,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా,  16,88,198 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 96,100 కరోనా యాక్టివ్ కేసులున్నాయని వైద్యఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

8239 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News