Thursday, April 18, 2024

భారత్‌ను భయపెడుతున్న కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 కొత్త కోవిడ్-19 కేసులు, 193 మంది మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,82,143కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 89,995 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 86,984 నయమై కోలుకున్నారు.

5,164 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. భారత్ లో కరోన వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 65,168 చేరాయి. ఇప్పటివరకు 2,197 ప్రాణాలు కోల్పోగా… 28,081 మంది కోవిడ్-19 తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 34,881యాక్టివ్ కేసులున్నాయి.

8380 new COVID 19 cases And 193 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News