అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో 845 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. 24 గంటల్లో 14, 285మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఎపికి చెందిన 812మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,907కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు 198మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 8,586 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకు 7,313మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
845 New Corona Cases reported in AP