Thursday, April 18, 2024

ఎపిలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

8702 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదుకావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్యం ఆరు లక్షలు దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 77,492 మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 8,702 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 72మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,014,62కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,177మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 88,197మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,08,088మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 47,38,847 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

8702 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News