- Advertisement -
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో జికా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. శనివారం వరకు 79 కేసులు బయటపడగా, ఆదివారం మరో 10 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 89 కి చేరింది. కాన్పూర్తోపాటు రాష్ట్రం లోని ఇతర ప్రాంతాల్లో జికా కేసులు పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ శనివారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి శానిటైజేషన్ పనులు వేగవంతం చేయాలని, ఫాగింగ్ డ్రైవ్ను చేపట్టాలని సూచించారు.
- Advertisement -