Friday, April 26, 2024

భారత్‌లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8909 new covid 19 cases and 217 deaths in india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 8,909 కొత్త కోవిడ్-19 కేసులు, 217 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 207,615కు చేరింది. ప్రస్తుతం 101,497 యాక్టివ్ కేసులుండగా…. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 100,303 నయమై కోలుకున్నారు. ఇండియాలో మొత్తం 5,815 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

తెలుగురాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎపిలో కరోనా కేసులు 3,200 చేరుకోగా…. 64 మందిని కరోనా కబలించింది. తెలంగాణలో 2,891 కోవిడ్ కేసులు… 92 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 72,300కు పెరిగింది. ఇప్పటివరకు 2,465 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 24,586 కేసులు… 197 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 22,132 పాజిటివ్ కేసులు… 556 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో 17,617 మందికి కరోనా సోకగా… 1,092 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

8909 New Covid 19 Cases and 217 Deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News