Friday, April 26, 2024

ఎపిలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజే 35మంది మృతి

- Advertisement -
- Advertisement -

Maharashtra Has Highest Number Of Corona Cases

అమరావతి: ఎపిలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఎపిలో 37,922 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 8,987 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 35మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా బులిటెన్ లో పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 9.76 లక్షలకు చేరుకుంది. ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 7,472మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,889 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు కరోనా నుంచి 9.12 లక్షలకు పైగా మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

8987 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News