న్యూఢిల్లీ: ఆల్ఖైదా ఉగ్రవాదుల భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించాలని భావించిన తొమ్మిది మంది ఆల్ఖైదా తీవ్రవాదులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు బెంగాల్, కేరళ ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ గా కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ముమ్మరంగా సోదాలు నిర్వహించి కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు, బెంగాల్ లో ని ముర్షీదాబాద్ ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. కేరళలోని 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల కుట్ర భగ్నంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Leu Yean Ahmed and Abu Sufiyan from West Bengal and Mosaraf Hossen & Murshid Hasan from Kerala are among the nine Al-Qaeda terrorists arrested by National Investigation Agency (NIA) pic.twitter.com/jMnRjTIjED
— ANI (@ANI) September 19, 2020
9 Al-Qaeda operatives arrested by NIA