Thursday, March 28, 2024

రాజస్థాన్‌లో ఒకే కుటుంబంలో 9మందికి కరోనా..

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవర పెడుతున్న వేళ రాజస్థాన్‌లో ఒకే కుటుంబంలో తొమ్మిది మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నలుగురు వ్యక్తులు దక్షిణాఫ్రికానుంచి జైపూర్ రాగా.. ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ కుటుంబంలో 9మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వారిని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఆర్‌యుహెచ్‌ఎస్)లో చేర్పించారు. ఆ కుటుంబంలోని 14 మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిని కొవిడ్ నిబంధనల ప్రకారం ఐసొలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. మిగతా వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. వీరందరి శాంపిల్స్‌ను జైపూర్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 213 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో ఒక్క జైపూర్‌లోనే 111 కేసులుండడం గమనార్హం.

9 of family test positive for corona in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News