Friday, April 26, 2024

పాలిసెట్‌కు 90.30 శాతం హాజరు

- Advertisement -
- Advertisement -

90.30 percent attendance for TS Polycet

సోమ లేదా మంగళవారం ప్రాథమిక కీ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమా, ఆర్‌జియుకెటి, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు 90.30 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 1,02,496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 92,556 మంది హాజరయ్యారని పాలిసెట్ కన్వీనర్ సి.శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాలలో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. సోమవారం లేదా మంగళవారం పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల చేసి, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News