Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 9,024 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9024 new covid 19 cases reported in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,024 కొత్త కోవిడ్-19 కేసులు 87 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,44,549కి పెరిగాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,203 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 87,597 కోవిడ్ యాక్టివ్ కేసులుండగా.. 1,54,749 మంది ఈ వైరస్ తో కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ఇప్పటివరకు 25 లక్షల 92,619 కరోనా టెస్టులు చేయగా…. గడిచిన 24గంటల్లో 58,315 మందికి పరీక్షలు చేసినట్టు అధికారులు తెలిపారు. అటు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ 50వేలకు పైగా నమోదవుతున్నాయి.

9024 new covid 19 cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News