Thursday, March 28, 2024

వరంగల్ లో కరోనా నుంచి కోలుకున్న 92 ఏళ్ల బామ్మ

- Advertisement -
- Advertisement -

92 Years old women cured in Warangal rural

వరంగల్ రూరల్: 92 ఏండ్ల బామ్మ కరోనా వైరస్‌ను జయించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాములునాయక్ తండాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం….అజ్మీర్ బాలమ్మ(92) తీవ్రమైన జ్వరం, జలుబు ఉండడంతో మే 12న కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకుంది. కరోనా పాజిటివ్ రాగానే ఉచిత మందులు తీసుకొని పౌష్టికాహారాన్ని తీసుకుని హోంఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంది. మే 30న నిర్ధారణ పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. కరోనా నుంచి బాలమ్మ కోలుకోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్తగా 1801 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 16 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News