Friday, April 26, 2024

తెలంగాణలో మరో 94 కొత్త పాజిటీవ్ కేసులు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

94 New Corona Cases reported in Telangana

 

హైదరాబాద్: గత వారం రోజుల నుంచి తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం కూడా పెద్ద మొత్తం కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 94 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు, మరో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,792కు చేరగా.. మృతుల సంఖ్య 88కి చేరింది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1492 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 1213 మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

94 New Corona Cases reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News