Saturday, April 20, 2024

కరోనా రెండో దశ: ఎపిలో 997 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

997 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుంది. దీంతో ప్రతిరోజు ఎపిలో దాదాపు వెయ్యి పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో ఎపిలో కొత్తగా 997 మందికి కరోనా నిర్దారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఎపిలో అత్యదిక కేసులు చిత్తూరు, గుంటూరు జిల్లాలోనే నమోదవుతున్నాయని పేర్కొంది. దీంతో ఎపిలో ఇప్పటివరకు 8.99లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 7,210 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,104 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎపిలో 8.86 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

997 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News