- Advertisement -
వికారాబాద్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలంలో షాపూర్ వాగులో దశరథ్ నాయక్ కుటుంబం చిక్కుకుపోయింది. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా వరద నీరు పోటెత్తడంతో వాగులో చిక్కుకుపోయారు. దీంతో స్థానికులు తాడు సహాయంతో ఏడుగురిని కాపాడారు. అయతే, వరద ఉధృతితో దశరథ్ భార్య వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లాలోని డిండి వాగులో రైతు దంపతులు చిక్కుకున్నారు. దీంతో హెలికాప్టర్ ను పంపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఎంఎల్ఎ గువ్వల బాలరాజు కోరారు. వాగులో చిక్కుకున్న వారిని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన దపంతులు గుర్తించారు.
A woman dies after drowning for floods in Vikarabad
- Advertisement -