Friday, March 29, 2024

క్రేజీ కాంబినేషన్‌లో మూవీ..

- Advertisement -
- Advertisement -

#AA21: Allu Arjun Announces his new movie with koratala

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త ఇది. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఈ స్టార్ హీరో ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ తన 21వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇక ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి… తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. డార్క్ షేడ్‌లో ఉన్న ఆ పోస్టర్‌లో ఆకాశంలో గద్దలు తిరుగుతున్నాయి. ఇక ఇది కొరటాల మార్కు సోషల్ అండ్ సీరియస్ సబ్జెక్టుగా తెలుస్తోంది. కాగా ఈ మూవీని కూడా బన్నీ పాన్ ఇండియా చిత్రంగా చేస్తున్నారు. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుంది. యువసుధ ఆర్ట్, జిఏ 2 పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 ప్రారంభంలో ఈ మూవీ విడుదల కానుంది.

ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నాము
తెలుగు ఇండస్ట్రీలోని గొప్ప హాస్యనటులలో ఒకరు అల్లు రామలింగయ్య. దాదాపు పన్నెండు వందల సినిమాలలో నటించిన ఘనత ఆయనది. ఇక శుక్రవారం అల్లు రామలింగయ్య వర్థంతి. 1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన ఆయన 2004 జులై 31న పరమపదించారు. ఎన్నో వందల క్యారెక్టర్లలో మరెన్నో వేరియేషన్స్ చూపించిన ఆయనను తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తుంచుకొని తలుచుకుంటున్నారు. ఇక అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయన పోస్టులతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ తన తాతయ్య గురించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. “ఈరోజు తాతయ్య మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. ఆయన గురించి ఆరోజు కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ ఆయన పడ్డ కష్టాలు, కృషి, పట్టుదల, ప్రయాణం ఏంటన్నది అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తికి సినిమాలపై ఉన్న మక్కువతోనే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము”అంటూ అల్లు అర్జున్ భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు.

Allu Arjun Announces his new movie with koratala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News