- Advertisement -
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఘట్కేసర్లో చిన్నారి ఆద్యను కరుణాకర్ కిరాతకంగా చంపాడు. ఆద్య మరణంతో కల్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రైలు కింద పడి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం కల్యాణ్ భువనగిరి పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో చిన్నారి తల్లి ప్రియుడు ఆద్యను చంపిన విషయం తెలిసిందే.
- Advertisement -