Friday, April 26, 2024

మహిళను వేధించిన ఎబివిపి జాతీయ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ఎబివిపి జాతీయ అధ్యక్షుడు సుబ్బయ్య షణ్ముగం తమిళనాడులోని చెన్నైలో ఓ మహిళను వేధించాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో బాధితురాలు మీడియాకు తెలిపింది. షణ్ముగం, సదరు మహిళ పక్క పక్కన ఉండే ప్లాట్లలో నివసిస్తున్నారు. ఆమె కారు పార్కింగ్ స్థలాన్ని షణ్ముగం రెండు, మూడు నెలల నుంచి వాడుకోవడంతో రెంట్ ఇవ్వాలని అడిగింది. దీంతో సదరు మహిళను బండబూతులు తిట్టాడు. వెంటనే వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేసింది. వాడిన మాస్కలతో పాటు మూత్ర విసర్జన ఇంటి ముందు చేయడంతో ఆమె మీడియాకు తెలిపింది. చెన్నైలోని ఆడంబాక్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారని స్థానిక కమిషనర్ దినకరన్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News