Friday, March 29, 2024

ఎసిబి కోర్టులో ఎంపి రేవంత్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

ACB Court Dismissed MP Revanth Reddy Petition

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విచారణ ఎసిబి పరిధిలోకి రాదన్న రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను శుక్రవారం నాడు ఎసిబి కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని ఎసిబి కోర్టు స్పష్టం చేసింది. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని ఎసిబి న్యాయస్థానం విచారణ జరపొద్దని కోరుతూ రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంతకుమునుపే న్యాయస్థానం వాదనలు విని తీర్పు వాయిదా వేసింది. అయితే పిటిషన్‌ను మళ్లీ తెరిచి మరోసారి వాదనలు వినాలని రేవంత్ రెడ్డి కోరగా ఎసిబి కౌంటరు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు వాదనలు విన్న కోర్టు తీర్పు వెలువరించింది.

 

ACB Court Dismissed MP Revanth Reddy Petition

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News