Friday, April 19, 2024

ఎసిబి వలలో ఐటిడిఎ అధికారులు

- Advertisement -
- Advertisement -

ఏటూరు నాగారం: ఏటూరు నాగారంలోని ఐటిడిఎ ఏఈ, డిఈలు ఎసిబి వ‌ల‌కు చిక్కారు. వివరాలలోకి వెళితే..  ఏఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న హ‌బిద్‌ఖాన్‌, డీఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న న‌వీన్‌కుమార్‌లు రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌ట్టారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం సాయంత్రం 6గంట‌ల సమ‌యంలో ఐటిడిఎ కార్యాల‌యంలో చోటు చేసుకుంది.

మేడారం ఆల‌య కాంట్రాక్టు ప‌నులు చేసిన వారికి చెల్లించాల్సిన రూ.16ల‌క్ష‌ల చెక్కు విడుద‌ల చేయ‌డానికి ఏఈ, డీఈలు రూ.50వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ఎసిబి అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భ‌ర‌తం ప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా ఐటిడిఎలో క‌ల‌క‌లం రేగింది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News