Friday, March 29, 2024

యాక్సెంచర్ 25వేల ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

Accenture to lay off 25000 employees

న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనిలో దాదాపు 5 శాతం వరకు ఉద్యోగులపై వేటు పడనుంది. తక్కువ ప్రతిభ, పనితీరు కనబరిచే ఉద్యోగులు ఈ తొలగింపు జాబితాలో ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కంపెనీ వ్యాపారం మందగించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. మధ్య ఆగస్టులో యాక్సెంచర్ సిఇఒ జూలీ స్వీట్ అంతర్గత సిబ్బంది సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ (ఎఎఫ్‌ఆర్) నివేదిక తెలిపింది. యాక్సెంచర్‌కు భారత్‌లో దాదాపు 2 లక్ష ల వరకు ఉద్యోగులు ఉండగా, వీరిలో వేలాది మంది ఇంటికి వెళ్లే అవకాశముంది.

Accenture to lay off 25000 employees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News