Friday, April 26, 2024

సూర్యాపేట జిల్లాలో ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. నేరేడుచర్ల సమీపంలో బైకు, లారీ ఢీకొని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను రామాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ, జశ్వంత్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News