హైదరాబాద్: ఉత్తరాఖండ్లో హత్య చేసి హైదరాబాద్లో తలదాచుకుంటున్న నిందితుడిన పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడు కళ్లలో కారంచల్లి తప్పించుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా గంగానహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ పెద్ద కామ్రే అలమ్ను వాసీం అనే వ్యక్తి 2019లో హత్య చేశాడు. అనంతరం తన భార్యతో కలిసి వాసీం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఎక్కడ వెతికినా దొరకకపోవడంతో అతడి స్నేహితుడి సమాచారం మేరకు నిందితుడు హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకున్నారు. ఎస్ఐ బిల్వర్ సింగ్ తన ఇద్దరు సిబ్బందితో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ పోలీసుల సహాయంతో నిందితుడి ఇంటికి వెళ్లారు. పోలీసులు వచ్చారని గ్రహించిన నిందితుడు పోలీసుల కళ్లలో కారం చల్లి ఘటనా స్థలం నుంచి వాసీం పారిపోయాడు. నిందితుడికి సహకరించిన భార్యతో సహా మరో మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.