Wednesday, April 24, 2024

పాపపై అత్యాచారం… నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆరేళ్ల పాపపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ ప్రాంతంలో న్యాయస్థానంలో జరిగింది. న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం…. కోప్రగాడి సంజయ్(58) కోడిగుడ్ల కంపెనీలో పని చేస్తూ ఎల్‌బినగర్‌లోని ఎన్‌టిఆర్ నగర్‌లోజీవన సాగిస్తున్నాడు. 2017 ఆగస్టు 7న ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లోకి చొరబడి రెండో తరగతి చదివే పాప(6)పై కామాంధుడు అత్యాచారం చేశాడు. పాప కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సంజయ్‌ను అరెస్టు చేశారు. పోక్సో ప్రత్యేక సెషన్స్ కోర్టు నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News