డిగ్రీ చదువాలన్న కోరికను తీర్చుకోబోతోంది నటి హేమ. ఈ ఆదివారం దానికి సంబంధించిన అర్హత పరీక్ష రాసింది. నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజీలో ఆమె ఈ అర్హత పరీక్ష రాశారు. పరీక్ష రాసిన తర్వాత హేమ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో తనకు డిగ్రీ చేయాలని ఉందని, తన పేరు చివరగా ఓ డిగ్రీ ఉండాలనే కోరికతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది. అర్హత పరీక్ష రాసేందుకు హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్గొండలో పరీక్ష రాసినట్టు హేమ తెలిపారు. ఎవరి కంటా పడకూడనే ఉద్దేశ్యంతో ఇక్కడ పరీక్ష రాసానన్నారు. అంతేకాదు ఈ సెంటర్ రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉండటం.. పైగా నేను ఎఫుడు ఇక్కడే ఎక్కువగా షూటింగ్స్ చేస్తుంటాను. అందుకే నల్గొండ జిల్లాను సెంటర్గా ఎంపిక చేసుకున్నానని చెప్పింది. అంతేకాదు పరీక్ష సమయంలో తనను వేరే వారు గుర్తు పడితే పరీక్ష రాయడంలో తనకు ఇబ్బంది అవుతుందనే కారణంతో నల్గొండలో పరీక్ష రాసినట్టు నటి హేమ చెప్పింది.