Thursday, March 28, 2024

కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

- Advertisement -
- Advertisement -

 

తిరుమల: అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు జాన్వీకి వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు జాన్వీకి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దిగిన ఫోటోలను జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీఅఫ్జా’ అనే రెండు చిత్రాలల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Actress Jhanvi kapoor Visits Tirumala on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News