Tuesday, April 16, 2024

నటి మందిరా బేడీ భర్త మృతి..

- Advertisement -
- Advertisement -

Actress Mandira Bedi's husband dies

 

న‌టి మందిరా బేడి భ‌ర్త రాజ్ కౌశ‌ల్ బుధ‌వారం ఉద‌యం గుండెపోటుతో క‌న్నుమూసారు. దీంతో హిందీ చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. చిత్ర సీమలో ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు రాజ్ కౌషల్.. ఆ తరువాత అతను ప్యార్ మెయిన్ కబీ కబీ, షాదీ కా లడ్డూ, ఆంథోనీ కౌన్ హై వంటి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మై బ్రదర్ నిఖిల్, షాదీ కా లడ్డూ ఇంకా ప్యార్ మెయిన్ కబీ కబీ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కౌషల్, మందిరా బేడి 1999 ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నారు. ఈ జంటకు 2011లో మొదటి సంతానం కలిగింది. మందిరా బేడి ప‌లు హిందీ చిత్రాలు, సీరియ‌ల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లో న‌టించారు. ద‌క్షిణాదిన శింబు మ‌న్మ‌థుడు, ప్ర‌భాస్ సాహో చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News