Thursday, March 28, 2024

ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కొన్న అదానీ గ్రూప్

- Advertisement -
- Advertisement -

Adani Flipkart deal

ముంబయి: ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో కొంత, ఆన్‌లైన్ ట్రావెలర్ అగ్రిగేటర్ అయిన క్లియర్‌ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో గణనీయమైన వాటాలు కొన్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ డీల్ 2021 నవంబర్‌లో ఖరారు కాగలదని సమాచారం. కాగా పెట్టుబడి భాగస్వామి కావడంతో క్లియర్‌ట్రిప్ తుదకు అదానీ గ్రూప్ ఆన్‌లైన్ పార్టనర్‌గా సేవలందించనుంది. ఈ డీల్ మీద ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు చెందిన సిఇఒ కళ్యాణ్ కృష్ణమూర్తి కూడా స్పందించారు. అదానీ గ్రూపుతో తమ సంబంధాలు పటిష్టపరుచుకుంటామన్నారు. ఇదిలావుండగా బిఎస్‌ఇలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 2.19 శాతం పెరిగి రూ. 1423.50 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News