Friday, April 19, 2024

లాకప్ డెత్ కేసులో ఎస్సై, పిసిల సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Addagudur SI Constable Suspended

ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, హైదరాబాద్ : మహిళ లాకప్‌డెత్ కేసులో భువనగిరి, అడ్గగూడురు ఎస్సై, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అడ్గగూడూర్ పోలీస్ స్టేషన్‌లో మూడు రోజుల క్రితం మరియమ్మ(45) అనుమానస్పస్థితిలో పోలీస్ స్టేషన్‌లో మృతిచెందింది. కేసు విచారణలో భాగంగా మరియమ్మను పోలీసులు స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. ఈ క్రమంలో మరియమ్మ మృతిచెందింది. లాకప్‌డెత్‌పై విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, దర్యాప్తులో ఎస్సై మహేష్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్య నిర్లక్షంగా వ్యవహరించారని తేలింది. దీంతో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News