- Advertisement -
మేడ్చెల్: జిల్లాలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాకేత్ మిథులలో దారుణం చోటుచేసుకుంది. శ్రీ ఆదిత్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర కుమార్ అనుమాస్పదంగా మృతిచెందారు. దమ్మాయిగూడలోని ప్లాట్ నంబర్ 57లో తన లైసెన్సు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పరిశోధించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు రవీంద్ర కుమార్ సిద్దిపేట వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Aditya Hospital MD Shot Self Dead in Medchal
- Advertisement -