Friday, April 19, 2024

మట్టితో చేసిన గణేష్ ప్రతిమలను ఆదరించండి

- Advertisement -
- Advertisement -

Admire clay ganesh statues says cp sajjanar

సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్: పర్యావరణాన్ని రక్షించేందుకు పర్యవరణహిత గణేష్ ప్రతిమలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ప్లాన్ ఎ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సిపి విసి సజ్జనార్‌ను గురువారం కలిశారు. మట్టితో చేసిన విగ్రహాలను ఆదరిస్తే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామన్నారు. ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ తయారు చేసిన గణేష్ ప్రతిమలు బహుల ప్రయోజనంన కలుగుతుందని అన్నారు. గణేష్‌ను కుండీలోనే నిమజ్జనం చేసే వీలుందని అన్నారు. కుండీలో ముందుగానే ఉన్న విత్తనాలు మొక్కలనిస్తాయని అన్నారు. మిర్చి, టొమాటో, బెండి, వంకాయ వంటి విత్తనాలు కుండీలో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థ సీఈఓ గణేష్ అమర్నాథ్ తదితరులు సిపిని కలిశారు.

Admire clay ganesh statues says cp sajjanar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News