హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు, పాఠశాలల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి వివిధ సర్టీఫికెట్ కోర్సులు, డిప్లోమాకోర్సులకు అడ్మిషన్లు ప్రకటించారు. నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సుల్లో చేరడానికి కనీస వయస్సు 10 సంవత్సరాలు పూర్తి అయి ఇండాల్సి ఉంది. డిప్లొమా కోర్సుల్లో వీణ, హిందూస్థానీ వొకల్, కర్ణాటక వోకల్, పేరిణి, కూచిపూడి, కథక్, సితార్, మృదంగం, నాదస్వరం, డోల, తబలా, ప్లూట్ కోర్సులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవాలని భాష సాంస్కృ తిక శాఖ ప్రకటనలో తెలిపింది. కోవిడ్ దృష్టా ఈ కోర్సులు ఆన్లైన్లో అందిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రీయ సంగీత, నృత్య కోర్సులు నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉంటుంది కావున సిలబస్కు అంతరాయం కలగ కుండా 22 ఎఫ్రిల్ నుంచి డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Admission in Government Dance and Music Colleges