Thursday, March 28, 2024

గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శుల సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని గాంధీ భవన్ లో ఏఐసిసి కార్యదర్శుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వర్కింగ్  ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, వర్కింగ్ ప్రెసిడెంట్ల వర్క్ ప్రోగ్రెస్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు తారాస్థాయికి చేరాయని వార్తలు వినిపిస్తున్నాయి. టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్‌రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకుగాను శుక్రవారం సిఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్డారెడ్డి ప్రశ్నించారు.

AICC Secretaries Meeting at Gandhi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News