Saturday, April 20, 2024

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Air India flight Crash on runway in Kerala

తిరువనంతపురం: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 191మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వేపై క్రాష్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పడంతో ముందుభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలానికి 20 అంబులెన్స్ చేరుకున్నాయి. ఎయిర్ పోర్టులోనే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. భారీ వర్షమే ఈ ప్రమాదానికి కారణమని డిజిసిఎ ప్రకటించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Air India flight Crash on runway in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News