Saturday, April 20, 2024

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Air pollution is main problem in world

నల్గొండ: ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నేపర్తిలో హరితహారంలో భాగంగా అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయరహదారి పరిసరాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. భూమిపై 33 శాతం అడవి ఉండాలి కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు శాతం కూడా లేదన్నారు. పర్యావరణ సమతుల్యత లోపించడంవల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు పెరిగాయన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే హరితహారం ఒక్కటే మార్గమన్నారు. ఆరేళ్లుగా హరితహారంలో నాటిన మొక్కలు ఫలితాలనిస్తున్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్‌పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News