- Advertisement -
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం ధెన్కనల్ ప్రాంతంలో శిక్షణ విమానం కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. మృతులు పైలట్ సంజీబ్ కుమార్, ట్రైనీ పైలట్ అనీష్ ఫాతిమాగా గుర్తించారు. కంకడహడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్స్టిట్యూట్ నుంచి టేకాఫ్ అయిన కొంచెం సేపు తరువాత ఈ ప్రమాదం జరిగిందని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బికె నాయక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతామని ఏవియేషన్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
- Advertisement -