Wednesday, April 24, 2024

ఎయిర్‌పోర్ట్ మెట్రోకు ఇంజినీరింగ్ కన్సల్టెంట్ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

మన ఎయిర్‌పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌లుగా సిస్థ్రా, రైట్స్, డిబి ఇంజినీరింగ్ సంస్థల కన్సార్షియంను ఎం పిక చేసినట్లు హెచ్‌ఏఎంఎల్, ఎండి, ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కన్సార్షియంలోని మూడు సంస్థలు ప్రజా రవాణారంగంలో ముఖ్యంగా మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం గల సంస్థలుగా ప్రఖ్యాతి చెందాయ ని ఆయన పేర్కొన్నారు. సిస్థ్రా సంస్థ – ఫ్రాన్స్‌కు చెందినదని, రైట్స్ భారతీయ రైల్వేలకు సంబంధించినదని, డిబి- సంస్థ జర్మనీ దేశాలకు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ దిగ్గజాలుగా ప్రఖ్యాతి గాంచిందన్నారు. జనరల్ కన్సల్టెంట్ ఎం పిక కోసం మొత్తం ఐదు అంతర్జాతీయ కన్సార్టియాలు ఆయ న తెలిపారు. కాగా సిస్థ్రా నేతృత్వంలోని కన్సార్టియం విజేతగా నిలిచింది.

ఈ కన్సార్టియం సాంకేతికంగా అధిక మార్కులు పొందడంతో పాటు, ఇంజినీరిం గ్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు గాను రూ. 98.54 కోట్లు కోట్ చేసిందని, ఇది పోటీలో పాల్గొన్న ఇతర సంస్థలకన్నా తక్కువ అని రెడ్డి తెలిపారు. మెట్రో రైల్వేలోని పలు విభాగాల్లో నిష్ణాతులైన 18 మంది ఇంజనీరింగ్ నిపుణులను అలాగే క్షేత్ర స్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజనీర్లు, తదితర సిబ్బందిని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణంలో ఈ కన్సార్టియం సమకూర్చుతుందని ఆయన తెలిపారు.

ఈ పోటీలో పాల్గొన్న ఐదు అంతర్జాతీయ కన్సార్టియాల సాంకేతిక సామర్థాన్ని, వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని సిస్థ్రా నేతృత్వంలోని కన్సార్టియంను ఎంపిక చేశామన్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ కె. రామకృష్ణారావు, హెచ్‌ఎండిఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, హెచ్‌ఏఎంఎల్, ఎండి, సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ ఇంజనీరింగ్ సలహా సంస్థ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని, ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి అవసరమైన ఈపిసి (EPC, Engineering, Procurement and Construction) టెండర్ డాక్యుమెంట్లను త్వరలోనే తయారు చేస్తుందని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News