Friday, April 19, 2024

కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య రాయ్, ఆరాధ్య..

- Advertisement -
- Advertisement -

Aishwarya Rai and Aaradhya recovery from Corona

ముంబయి: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. నానావతి ఆసుపత్రిలో కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్న ఐశ్వర్య రాయ్, ఆరాధ్య ఇద్దరికి రిపోర్ట్ లో నెగిటీవ్ వచ్చిందని.. దీంతో వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారని అభిషేక్ తెలిపాడు. తాను, తన తండ్రి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్పారు. అభిమానుల గుడ్ విషెస్, పూజలు తమకు అండగా నిలిచాయని.. కృతజ్ఇతలని అభిషేక్ ట్వీట్ చేశాడు. కాగా, జూలై 12న కరోనా పరీక్షలు చేయించుకున్న ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి నానావతి ఆసుపత్రిలో వీరు చికిత్స తీసుకున్నారు.ఇక, బిగ్ బి ఫ్యామిలీలో జయ బచ్చన్ కు తప్ప అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే.

Aishwarya Rai and Aaradhya recovery from Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News