Friday, April 19, 2024

అక్కన్నపేటలో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

ఎకె 47 తో అర్ధరాత్రి వ్యక్తిపై కాల్పులు జరిపిన గ్రామస్తుడు
తప్పిన ప్రాణహాని
నిందితుడు పరార్

 

మన తెలంగాణ/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు సంచలనం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన దేవుని సదానందం అనే గొర్లకాపరి అర్ధరాత్రి సమయంలో తన ఇంటి సమీపంలో నివసించే గుంటి గంగరాజు ఇంటికి వెళ్ళాడు. కిటికీలో నుంచి గంగరాజుపై ఎకె 47 తో సదానందం రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గంగరాజు తృటిలో తప్పించుకోగా నిందితుడు పరారు అయ్యాడు. పోలీసులు అక్కడికి చేరుకొని రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సదానందం ఇంటి వద్ద మరో బులెట్, తల్వార్, ఏకే బెల్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. హుస్నాబాద్, సిద్దిపేట ఎసిపిలు, క్లూస్ టీమ్ విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా గొర్ల కాపరికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ సాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News