- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్, బిడిఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి అయిందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన విద్యార్ధులు ఈనెల 10వ తేది లోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. సీటు కేటాయింపు వివరాలను ఇప్పటికే అభ్యర్ధులకు ఎస్ఎంఎస్ ద్వారా చేరవేశామని, నిర్ధేశించిన గడువులోగా చేరని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హతను కొల్పోతారని వర్సీటి తెలిపింది. సీటు అలాట్ మెంట్ వివరాల కొరకు అభ్యర్ధులు అడ్మిషన్ వెబ్సైట్ http.//tsmedadm.tsche.inలో పరిశీలించాలని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -