Thursday, April 25, 2024

కరోనాపై పోరాటానికి అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మహమ్మారి క‌రోనా వైరస్(కోవిడ్-19)పై కొనసాగుతున్న పోరాటంలో ప్రజలు ఆకలితో బాధపడకుండా ఉండేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ అండగా నిలబడుతోంది. ఒక్కొక్కరుగా స్టార్ హీరోలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్, పలువురు స్టార్ డైరెక్టర్లు భారీగా విరాళాలు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పోరాటంలో ప్రజలకు తన వంతుగా రూ.1.25 కోట్లు విరాళం అందిస్తున్న‌ట్లుగా ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ, ఎపి సిఎంల స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లు చొప్పున అందిస్తున్న‌ట్లుగా బన్నీ తెలిపారు. అదేవిధంగా మ‌రో రూ.25 ల‌క్ష‌లు కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందించనున్నట్లు తెలిపారు.

Allu Arjun donates Rs.1.25 cr for Corona Relief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News